
ఈ సందర్భంగా ఈ మూడేళ్ళలో అన్ని పధకాలకు కలిపి రూ.1.65 లక్షల కోట్లు పంచిపెట్టామని జగన్ గర్వంగా చెప్పుకొన్నారు.
ఈ మూడేళ్ళలో జగన్ ప్రభుత్వం సుమారు రూ.7-8 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ప్రతిపక్ష టిడిపి, కాంగ్రెస్ పార్టీలు చెపుతున్నాయి. దానిలో రూ.1.65 లక్షల కోట్లు సంక్షేమ పధకాలకు ఖర్చు చేశామని సిఎం జగన్ స్వయంగా చెప్పుకొన్నారు. కనుక మిగిలిన రూ.5.5 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? అనే సందేహం కలుగక మానదు.
ఎందుకంటే గత మూడేళ్ళుగా రాష్ట్రంలో అంతంత మాత్రంగానే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. లక్షల కోట్లు అప్పులు తెచ్చినా రాష్ట్రంలో రాజధాని నిర్మించలేదు… పోలవరం పూర్తిచేయలేమని మంత్రి అంబటి చేతులెత్తేశారు కూడా. రాష్ట్రవ్యాప్తంగా గుంతలు పడిన రోడ్లకు కనీసం మరమత్తులు చేయించలేదని ప్రతిపక్షాలు, మీడియా ఫోటోలు, వీడియోలతో సహా చూపుతున్నాయి. లక్షల కోట్లు అప్పు చేసి అభివృద్ధి చేయలేదు… మౌలిక వసతులు కల్పించలేదు. ఆ సొమ్ములో కొంత మాత్రమే సంక్షేమ పధకాలకు ఖర్చు చేశారు. మరి మిగిలింది ఎక్కాడా?
In an industry where success often decides everything, some filmmakers continue getting opportunities because of…
As CM Vijay takes his oath today, he carries a heavy burden of suspicion. For…