
జిల్లాలోని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్ది, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆలూరు ఎమ్మెల్యే మణిగాంధీలు ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. అయితే మరో ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. తన పార్టీకి అత్యంత బలమైన జిల్లాగా ఉన్న కర్నూలు నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే, పార్టీకి అపార నష్టమేనని భావించిన జగన్, నష్ట నివారణ చర్యలు చేపట్టబోతున్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్యేలను నిలువరించేందుకు జగన్ చేసిన యత్నాలు బెడిసికొట్టడంతో, తనకు అత్యంత సన్నిహితులుగా పేరున్న కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ గనుల కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డితో పాటు బళ్లారి ఎంపీ శ్రీరాములును రంగంలోకి దించినట్లుగా పొలిటికల్ వర్గాల టాక్. ఆర్థికంగా బలవంతులైన ‘బళ్లారి బ్రదర్స్,’ జగన్ ఇచ్చిన సూచనతో ఇఫ్పటికే రంగంలోకి దిగిపోయారని సమాచారం.
విడతల వారీగా జరిపిన చర్చల్లో భాగంగా పెద్ద ఎత్తున ఆర్థిక చేయూతతో పాటు భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామన్న హామీతో పార్టీ మారాలనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో మెజారిటీ నేతలు మనసు మార్చుకున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ‘బళ్లారి బ్రదర్స్’ హామీలకు ఏ మాత్రం తలొగ్గని ఓ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నారట. దీనికి అనుచరుల నుంచి మద్దతు రావడంతో త్వరలోనే సదరు ఎమ్మెల్యే మాత్రం సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని జిల్లాలో ప్రచారం సాగుతోంది.
Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…