
2014 ఎన్నికల తరువాత తెలుగు దేశం పార్టీ కొంతమేర బలపడిన ఇప్పటికి రాయలసీమలో వైకాపా స్ట్రాంగ్ గానే ఉంది. ఇప్పుడు జగన్ కోస్తాలో పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఇక నుండి ఆయనకు ప్రతి జిల్లా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవాలి. కొంతమేర నెల్లూరులో తప్ప మిగతా అన్ని జిల్లాలలో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
ఇప్పటిదాకా 68 రోజుల పాటు పాదయాత్ర సాగింది. మిగిలిన 2000పై చిలుకు కిలోమీటర్లు నడవడానికి ఇంకా ఎన్ని రోజులు పడతాయో చూడాలి. అయితే పెద్దగా మీడియా సహకారం లేకపోవడం, పాదయాత్ర పెద్దగా ప్రజలపై ప్రభావం చూపకపోవడంతో పార్టీ ఒకరకంగా నిరాశగానే ఉందని చెప్పాలి.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…