
వాస్తవానికి ఈ పాదయాత్ర కోసం కోర్టు నుండి అనుమతి కోరుతూ జగన్ ఓ పిటిషన్ కూడా దాఖలు చేసారు. అయితే రాజకీయ అవసరాల నిమిత్తం అనుమతి ఇవ్వబోమంటూ కోర్టు స్పష్టం చేస్తూ, అనుమతిని నిరాకరించింది. కానీ ఈ పాదయాత్రకు కోర్టు అనుమతి వస్తుందన్న ఉద్దేశంతో ‘పాదయాత్ర’ అంశాన్ని జగన్ ముందుగానే ప్రకటించేసారని, లేకుంటే కోర్టు ఉత్తర్వులు తర్వాత ఓ ప్రకటన చేసి ఉండేవారని పొలిటికల్ టాక్. అయితే అక్టోబర్ మొదటి వారం నుంచి జిల్లాల వారీగా జగన్ పర్యటించనున్నారని, పార్టీ నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు జరపనున్నారని సమాచారం.
ఓ పక్కన పాదయాత్ర… మరో పక్కన ఫ్రైడే కోర్టు… ఇలా రెండింటిలో కూడా కోర్టు అంశం హైలైట్ గా నిలిచి, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకే కేసులు ముగిసిన తర్వాత పాదయాత్రను ప్రారంభించే యోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా విచారణ దశలో ఉన్న కేసులు ఎప్పటికి పూర్తవుతాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీంతో పాదయాత్ర విషయంలో ప్రస్తుతం వైసీపీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నారని, ఏది ఏమైనా అక్టోబర్ 27న అయితే ప్రారంభం కాదని, పక్కాగా చేయాలని భావిస్తే మాత్రం నవంబర్ మొదటి వారం నుండి ప్రారంభించే ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…