
హిందూ ఆధ్యాత్మిక, భక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలోకి అన్యమతస్తుల ప్రవేశంపై ఉన్న నిబంధన ప్రకారం… ‘హిందూ విశ్వాసాల మీద నమ్మకం ఉందని’ తెలుపుతూ ముందుగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ‘వైఎస్ జగన్ అనే నేను…’ అంటూ ప్రారంభమయ్యే ఈ డిక్లరేషన్ ను ఆలయం వద్దకు జగన్ చేరుకోగానే టీటీడీ అధికారులు ఎదురెళ్ళి మరీ ఇచ్చారు.
అయితే జగన్ మాత్రం ఈ డిక్లరేషన్ ను ఇచ్చేందుకు నిరాకరించారు. టీటీడీ అధికారులపై ఒకింత ఆగ్రహంతో చూసిన జగన్, ఆ పై సున్నితంగా తిరస్కరించి స్వామి వారి దర్శనానికి వెళ్ళిపోయారు. జగన్ తో పాటు వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. పాదయాత్ర సక్సెస్ అయ్యి, తద్వారా సిఎం పీఠం అధిష్టించడమే ‘జగన్ అండ్ కో’ ఈ పర్యటన లక్ష్యం.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…