
గుంటూరు నుండి ఇచ్ఛాపురం వరకు ఆమె కొన్ని రోడ్ షోలలో పాల్గొంటారని సమాచారం. దీనికి సంబంధించిన షెడ్యూల్ 2-3 రోజులలో సిద్ధం అవుతుందట. అన్న ఒక వైపు చెల్లెలు ఒక వైపు పంచుకుని ప్రచారం చెయ్యబోతున్నారు. ఇప్పటికే అన్ని ఎమ్మెల్యే స్థానాలకు, ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి జగన్ ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల లాగానే ఈ సారి కూడా షర్మిళ పోటీ చేస్తారని వదంతులు వినపడినా అది జరగలేదు. 2014లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన వైఎస్ విజయమ్మ కూడా ఈ సారి పోటీలో లేరు.
2014 ఎన్నికలకు ముందు జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీని ముందుకు నడిపించింది షర్మిళ. పాదయాత్ర చేసి పార్టీని ప్రజలలోకి తీసుకుని వెళ్లారు. రాజన్న కూతురిని, జగనన్న చెల్లల్ని అంటూ దూసుకుపోయారు. ఇప్పుడు ఆవిడ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓటింగు వచ్చే నెల 11న జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్య అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక వేళ ఓడిపోతే కొత్తగా పెట్టిన ఒక ప్రాంతీయ పార్టీ రెండు పర్యాయాలు వరుసగా ప్రతిపక్షంలో మనగలగడం అసంభవం.
The overseas performance of Dhurandhar: The Revenge has become a major talking point. The film…
అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా వాటికి ఆర్ధిక పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడే ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలి. విగ్రహాలు,…