
దీనితో టీడీపీకి భారీ విజయం కట్టబెట్టారు. అయినా జగన్ లో మార్పు రాలేదు. పెద్దంతరం, చిన్నంతరం లేకుండా సాగే ఆయన విమర్శలు కొనసాగుతున్నాయి. నిన్న అనంతపురంలో సాగిన ఆయన పాదయాత్రలో చంద్రబాబు అబద్దాల పుట్టని, దగాకోరని, పిట్టలదొరని జగన్ మోహన్ రెడ్డి పరుషపదజాలంతో దూషించారు.
దీనితో తలలు పట్టుకోవడం ఆ పార్టీ నాయకుల వంతు అయ్యింది. అధికారమే పరమావధిగా ముందుకు సాగుతున్న జగన్ కేవలం తనను ముఖ్యమంత్రి పీఠానికి దూరం చేసినందుకుగాని చంద్రబాబుపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నట్టు కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక భూవివాదంలో ఒక మహిళపై కొందరు దాడి చేస్తే, దళిత మహిళ చీర, జాకెట్టు చించేలా టీడీపీ నేతలను ఉసిగొలిపే హీనస్థితికి చంద్రబాబు దిగజారారని జగన్ ఆరోపించారు.
ఎక్కడో విశాఖలో జెర్రిపోతులపాలెంలో జరిగిన ఒక వివాదానికి ముఖ్యమంత్రే ప్రేరేపించారని ఆరోపించడం వల్ల అసలు విషయం పలుచబడి జగన్ ఉన్మాదిగా కనపడుతుంది. ఇలాంటి చవుకబారు విమర్శల వల్ల గవర్నమెంట్ ను ఇరుకునపెట్టకపోగా ప్రజలలో తానే పల్చన అవ్వడం ఒక్క జగన్ కె చెల్లిందని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. ఆయనకు తెలీదు, చెప్తే వినడు అని వాళ్ళు అనుకుంటున్నారట
టాక్సిక్ ఫెయిల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరి దృష్టి రాకా మీద పడింది. విడుదలయ్యాక ఈ సినిమాకూ అదే…
Hunkkaar arrives with a subject that is bound to generate discussion, and its teaser suggests…