
ఇదిలా ఉంటే, ఈ రోజుతో మొదలైన ఈ వలసలు మార్చి 5వ తేదీ వరకు కొనసాగుతాయని, దాదాపుగా వైసీపీ 50 శాతం వరకు ఖాళీ అవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో రాబోతున్న వారం రోజుల్లో ఏపీలో రాజకీయ ప్రకంపనలు సంభవించడం ఖాయంగా కనపడుతోంది. ఒక ప్రతిపక్ష పార్టీ నేత 21 మంది అధికార పార్టీ నేతలు తనతో టచ్ లో ఉన్నారని చేసిన గాలి కబుర్లకు వీరంతా తట్టుకోలేకపోయారని, పౌరుషంతో ముందుకు వచ్చి, రాష్ట్ర శ్రేయస్సు రీత్యా టిడిపిలో చేరుతున్నారని అభిప్రాయపడ్డారు.
ఈ సమయంలో విమర్శలకు తావు లేదని, ఏపీలో రాజకీయ పునర్వ్యవస్థీకరణ కోసం సిఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని, ఇక జగన్ “లెక్క” పెట్టుకోవడమే తరువాయి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా వైసీపీ వర్గాలో కలకలం సృష్టిస్తున్నాయి.
తమిళనాడు ఎన్నికలలో అధికార డీఎంకే అధినేత స్టాలిన్తో సహా ఆ పార్టీ ఓడిపోయింది. కానీ కేవలం రెండు మూడు రోజుల్లోనే…
లలితా జ్యూవెలరీ అధినేత ‘డబ్బు ఎవరికీ ఊరికే రాదు,’ అని వాణిజ్య ప్రకటనలలో పదేపదే చెపుతుంటారు. ఆయన మాటలను టీవీకే…