
చట్ట ప్రకారం ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 90 రోజుల లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయవలసి ఉంటుంది. అనంతబాబుని అరెస్ట్ చేసి నేటితో 89 రోజులు పూర్తయ్యాయి. మరొక్క రోజు ఆలస్యం చేస్తే ఆటోమేటిక్గా అనంతబాబుకి బెయిల్ వచ్చేస్తుంది. కానీ తాము ఒత్తిడి చేస్తే తప్ప ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని అన్నారు. అనంత బాబుకు బెయిల్ వచ్చేందుకే పోలీసులు ఛార్జ్ షీట్ వేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు.
కనుక ఆయన దళిత, ప్రజా సంఘాలతో కలిసి కాకినాడలో ధర్నాలు చేసి పోలీసులపై ఒత్తిడి పెంచారు. వారి ఒత్తిడి భరించలేక ఎట్టకేలకు పోలీసులు నిన్న అంటే గడువు ముగియానికి రెండు రోజుల ముందు రాజమండ్రిలో ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
అయితే అనంతబాబుకి ఎలాగైనా జైలు నుంచి విముక్తి కల్పించాలని పోలీసులు అనుకొంటే దానిని ఎవరూ ఆపలేరని ముప్పాళ్ళ సుబ్బారావు అభిప్రాయం వ్యక్తం చేసారు. కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లో ఒక్క తప్పు ఉన్నా దానిని న్యాయమూర్తి తిరస్కరించే అవకాశం ఉందని, అప్పుడు అనంత బాబుకి ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేస్తుందని తెలిపారు. కనుక పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను న్యాయమూర్తి అంగీకరిస్తేనే పోలీసుల చిత్తశుద్ధి బయటపడుతుందని అన్నారు. ఆ ఛార్జ్ షీట్ని న్యాయమూర్తి శనివారం పరిశీలించే అవకాశం ఉంది.
The trailer of Drishyam 3 starring Mohanlal and directed by Jeethu Joseph was released recently…
తమిళనాడు మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విజయ్ ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ…