
రంగాను ఒక వీధి రౌడీతో పోల్చారు. ఆయన చావును అపహాస్యం చేసారు. దీనిపై ఆయన కుమారుడు రాధా మరియు కాపు సమాజం భగ్గుమంది. వెంటనే ఆయనకు షో కాస్ నోటీసు ఇచ్చింది వైకాపా. కాపు తిరుగుబాటుకు భయపడి ఆయన సమాధానం చెప్పేలోపే పార్టీ నుండి సస్పెండ్ చేసారు.
అయితే గౌతమ్ రెడ్డి జగన్ పాదయాత్రలో ప్రత్యక్షమయ్యి జగన్ పక్కనే నడిచారు. జగన్ తో మాటామంతీ కూడా నడిపారు. దీనిబట్టి అప్పటి సస్పెన్షన్ అంతా హంబక్ అని తేలిపోయింది. మడమ తిప్పానూ… మాట తప్పను అంటే ఇదేనా జగన్? అని సోషల్ మీడియాలో అంతా ప్రశ్నిస్తున్నారు.
ఈ సంఘటన తరువాత వంగవీటి రాధా పార్టీ వీడడం దాదాపుగా కన్ఫర్మ్ అనే చెప్పుకోవాలి. కాపులు కూడా జగన్ పై కోపం తెచ్చుకోవడం ఖాయం. ప్రస్తుత తరుణంలో ఇది అనాలోచిత చర్య అనే చెప్పుకోవాలి. తొందర్లో జగన్ పాదయాత్ర గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు జగన్ కు ఇబ్బందులు ఎదురు అవ్వొచ్చు.
The Telangana political landscape is starting to heat up as Chief Minister Revanth Reddy has…
Maremma starring Maadhav has created good buzz with the glimpse, teaser and songs. The story…