
అయితే, ఇవన్నీ కూడా కుట్ర పూరితమైన కేసులనీ, కేవలం కాపులను అణిచి వేయడానికే ప్రయత్నిస్తున్నారని, వంగవీటి రంగాను తుదముట్టించి ఆనాడు ‘కాపునాడు’ అణిచివేయగా, ముద్రగడపై ఏకంగా 73 కేసులు మోపి, ఈనాడు ‘కాపునాడు’ను నీరు కార్చేందుకు రకరకాలుగా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని జగన్ మీడియా సోషల్ వెబ్ సైట్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే సదరు మీడియా వ్యవహార తీరు పట్ల నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వందల మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపివేసి, హత్య రాజకీయాలు చేసినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి ఇది వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం కాదని, తప్పు ఎవరూ చేసినా శిక్షార్హులేనని సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు.
తమిళనాడు ఎన్నికలలో అధికార డీఎంకే అధినేత స్టాలిన్తో సహా ఆ పార్టీ ఓడిపోయింది. కానీ కేవలం రెండు మూడు రోజుల్లోనే…
లలితా జ్యూవెలరీ అధినేత ‘డబ్బు ఎవరికీ ఊరికే రాదు,’ అని వాణిజ్య ప్రకటనలలో పదేపదే చెపుతుంటారు. ఆయన మాటలను టీవీకే…