
దీంతో విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ అటకెక్కిందన్న వాదన తెరపైకి వచ్చింది. మరోవైపు ఏపీ సర్కార్ కూడా గత రెండు మాసాలుగా పుష్కర పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టులో కీలక అంశంగా పరిగణిస్తున్న భూసేకరణకు చంద్రబాబు సర్కారు శ్రీకారం చుట్టింది. మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమయ్యే భూముల కోసం తొలి విడతగా 300 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో త్వరలోనే మెట్రో ప్రాజెక్టు భూసేకరణ ప్రారంభం కానుంది.
The motion poster of Chandrayan has been unveiled, giving audiences a glimpse into a wildly…
Chennai Super Kings have been asked to consider a change in captaincy before IPL 2027,…