
ఇక తెలంగాణ విషయానికి వస్తే కారు జోరు మరో సారి కనిపించింది. ఒకటి రెండు సంస్థలు కాంగ్రెస్ కు బీజేపీకు ఒక్కటి అర సీట్లు ఇచ్చినా తెలంగాణ ప్రజలు సారు వెనకే ఉన్నారు. చివరిగా ఆంధ్రప్రదేశ్ విషయంలో మరోసారి సందిగ్దత కనిపించింది. గత ఎన్నికలు లాగానే టీడీపీ అని కొందరు, వైఎస్సార్ కాంగ్రెస్ అని కొందరు చెప్పుకొచ్చారు. ఎక్కువగా సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపుకే మొగ్గు చూపడం విశేషం. లగడపాటి, టుడేస్ చాణక్య వంటి ట్రాక్ రికార్డు కలిగిన సంస్థలు టీడీపీ వైపు నిలిచాయి.
అన్ని సర్వేలు జనసేన పార్టీ అత్యంత పేలవమైన ప్రదర్శన ఇవ్వబోతుంది అని చెప్పడం విశేషం. పవన్ కళ్యాణ్ తన రెండు సీట్లూ గెలుస్తారు అని కూడా ఏ సంస్థా చెప్పకపోవడం గమనార్హం. దీనితో జనసైనికులు ఢీలా పడిపోయారు. కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం రావడమంటే రెండు తెలుగు ప్రభుత్వాలకు వచ్చే ఐదు సంవత్సరాలు కేంద్రంలో ఎటువంటి పనులు అవ్వవని కూడా చెప్పవచ్చు. పై పెచ్చు బీజేపీని ఇక్కడ వ్యాపించడం కోసం రెండు రాష్ట్రాలలోని అధికార పార్టీలను ఇబ్బంది పెట్టడం కూడా ఖాయం.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…