
రాష్ట్రంలో ప్రజలు బీజేపీని పట్టించుకోవడం లేదు కనుకనే జనసేనతో అంటకాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ టిడిపితో పోత్తులకు సిద్దపడుతుండటంతో బిజేపీ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలాగ మారింది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ కోసం ఇంతకాలం తాము దూరంగా పెట్టిన టిడిపితో చేతులు కలుపలేదు. అలాగని పవన్ కళ్యాణ్ ను వదులుకోలేదు.
ఇవాళ్ళ ఏపీ బిజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు ఏలూరులో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఓ విలేఖరి “పవన్ కళ్యాణ్ టిడిపితో మళ్ళీ పొత్తులు పెట్టుకోబోతున్నట్లు చెప్పారు కదా? దానిపై మీ అభిప్రాయం ఏమిటి?” ప్రశ్నించినప్పుడు ఆయన కొంత అసహనంగా “ప్రస్తుతానికి జనసేన-బిజేపీ కలిసి పనిచేస్తున్నాయి. అయన ఏ పార్టీతో పొత్తులు పెట్టుకొంటారో వెళ్లి ఆయనే అడగండి. మాకు పొత్తులపై పూర్తి స్పష్టత ఉంది. మా పార్టీ లక్ష్యం ఒకటే. ఆంద్రప్రదేశ్ అభివృద్ధి. ప్రధాని నరేంద్ర మోడీ చేస్త్తున్న అభివృద్ధి కార్యక్రమాలే మాకు చాలు. వాటి గురించి మేము ప్రజలకు చెప్పుకొని ఓట్లు అడిగి గెలవగలమనే పూర్తి నమ్మకం మాకు ఉంది,” అని అన్నారు.
నేడు ప్రధాని మోడీ హైదరాబాద్లో హెచ్ఐసిసిలో రూ. కోట్లు9,377 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ…
Bhumi Pednekar has been at the centre of discussions on social media for quite some…