
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “అక్రమాస్తుల కేసులో బెయిల్పై బయట ఉన్న సిఎం జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళవచ్చు కానీ ఎంపీనైన నేను నా నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి వీలులేదా?ఇదెక్కడి న్యాయం? నేను ఏపీలో అడుగు పెట్టగానే పోలీసులు అరెస్ట్ చేస్తారని నా సహచర ఎంపీలు చెప్పారు.
‘లా జస్టిస్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ’లో సభ్యుడిగా ఉన్న నేను విశాఖలో జరుగబోయే కమిటీ సమావేశానికి హాజరైతే నన్ను అరెస్ట్ చేస్తామని కనుక సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని లేదా నేను లేకుండానే నిర్వహించుకోవాలని పోలీసులు కమిటీ సభ్యులకు చెప్పారు.
ప్రధాని నరేంద్రమోడీ నా జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరవుతున్నపుడు ప్రోటోకాల్ ప్రకారం నేను కూడా హాజరుకావలసి ఉంటుంది. కనుక జగన్ ప్రభుత్వం నన్ను అడ్డుకొని అరెస్ట్ చేస్తే అది నా హక్కులకు భంగం కలిగించినట్లవుతుంది. కనుక నేను లోక్సభ స్పీకరుకి ఫిర్యాదు చేస్తాను. అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తాను. నాకు నా హక్కులను ఏవిదంగా కాపాడుకోవాలో బాగా తెలుసు.
జగన్ ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా నేను తప్పకుండా భీమవరానికి వస్తాను. ప్రధాని నరేంద్రమోడీ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటాను. ఆ తరువాత జగన్ ప్రభుత్వంనాపై ఎన్ని కేసులు పెట్టుకొన్నా ఎదుర్కొనేందుకు నేను సిద్దమే,” అని రఘురామకృష్ణ రావు అన్నారు.
Ram Charan's Peddi, directed by Buchi Babu Sana, has already emerged as one of the…
తమిళనాడు సిఎంగా విజయ్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే ఎన్నికలలో ఇచ్చిన మూడు హామీలను అమలు చేస్తూ మూడు…