
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించడంలో రఘురామకృష్ణంరాజు కంపెనీలు విఫలం అయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే బకాయిలు ఎగ్గొట్టి ఆ సొమ్ములు దారి మళ్లించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనపై దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఒక ప్రముఖ నాయకుడిపై సిబిఐ దాడులు జరగడం ఇదే మొదటి సారి. గతంలో వైఎస్ కు బాగా క్లోజ్ గా మెలిగిన ఆయన తరువాతి కాలంలో జగన్ తో విభేదించి ఆ పార్టీని వీడారు.
ఆ తరువాత బీజేపీ, టీడీపీలలో చేరి ఎన్నికలకు కొంచెం ముంది వైఎస్సార్ కాంగ్రెస్ కు తిరిగి వచ్చి ఆ పార్టీ తరపున నరసాపురం పార్లమెంట్ కు పోటీ చేశారు. టీడీపీ తరపున కలవపూడి శివ, జనసేన నుండి నాగబాబు ఆయన ప్రత్యర్ధులు. ఈ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేసిన ఆయన ఈ ఎన్నికల కోసం భారీగా ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈ సీటులో గెలుపు పట్ల అన్ని పక్షాలూ నమ్మకంగా ఉండటం విశేషం. ఎవరు గెలిచారో తెలియాలంటే మే 23 దాకా వేచి చూడాల్సిందే.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…