
‘బాహుబలి 2’ విడుదలైన మూడు వారాలకు ‘దువ్వాడ జగన్నాధమ్’ ప్లాన్ చేయగా, సమ్మర్లో ‘బాహుబలి 2’ ప్రభంజనం ఎక్కువగా ఉంటే, ఆశించిన ధియేటర్లు లభించడం కష్టమని తేలిపోయింది. ఇక మే 19 మిస్సయితే, మరోవైపు ప్రిన్స్ – మురుగదాస్ ల సినిమా జూన్ 23వ తేదీకి ఫిక్స్ చేసుకున్నారు. అంటే మే చివరి వారంలో గానీ, జూన్ మొదటి వారంలో గానీ విడుదల చేసినా జూన్ 23 నాటికి ధియేటర్లు లేపేయడం ఖాయం. దీంతో సమ్మర్ ను ఎన్ క్యాష్ చేసుకోవాలన్న ‘దువ్వాడ జగన్నాధమ్’ ఆశలు నేరేవేరే అవకాశాలు చాలా తక్కువగా మారాయి.
ఇవన్నీ పరిశీలనలోకి తీసుకున్న నిర్మాత దిల్ రాజు, ‘సేఫ్ గేమ్’లో భాగంగా మే 19 నుండి మరో రెండు నెలల పాటు వాయిదా వేసుకుని, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఫ్రెష్ రిలీజ్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… బన్నీ వెనుకడుగు వేయడంతో మే 19వ తేదీకి అక్కినేని హీరో నాగచైతన్య ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మే 19కి ఫిక్స్ చేసారట.
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…