
తన దూకుడైన స్వభావంతో మ్యాచ్ లను ఆద్యంతం రసవత్తరంగా మార్చేసే విరాట్ కోహ్లి భుజం గాయం కారణంగా ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. అయితే కొన్ని మ్యాచ్ ల వరకు అందుబాటులో ఉండడా? లేక టోర్నీ మొత్తం నుండి తప్పుకున్నాడా? అన్నది ఇంకా ఖరారు కాలేదు. కానీ బెంగుళూరు ఆడబోయే తొలి మ్యాచ్ లలో విరాట్ ను వీక్షించలేం. ఒక్క విరాట్ కోహ్లినే కాదు, ఆసీస్ సిరీస్ మొత్తం సూపర్ ఫాంలో ఉన్న రాహుల్ కూడా భుజం గాయం కారణంగా ఐపీఎల్ నుండి పూర్తిగా తప్పుకున్నాడు.
అలాగే మురళీ విజయ్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్ వంటి ఇతర టీమిండియా క్రీడాకారులు తప్పుకోగా, విదేశాలకు చెందిన క్రేజీ ఆటగాళ్ళు కూడా ఇదే రూట్ లో పయనిస్తున్నారు. డివిలియర్స్ కు కూడా గాయం కావడంతో, తొలి మ్యాచ్ లకు అందుబాటులో ఉండడనే సమాచారం ఆ జట్టును కలవరపెడుతోంది. అలాగే కెవిన్ పీటర్సన్, డీకాక్, డుమినీ, రస్సెల్, బ్రావో, ముస్తాఫిజుర్ వంటి అద్భుతమైన ప్రతిభ కనపరిచే క్రీడాకారులు లేకపోవడంతో ఐపీఎల్ చప్పగా సాగుతుందేమోనన్న అంచనాలు మొదలయ్యాయి. అందరి ఆటగాళ్ళకు ఒకటే బెడద… శృతిమించిన షెడ్యూల్స్ తో గాయాల బారిన పడడం!
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…
Well, the inevitable has happened as the Telangana government under the leadership of Chief minister…