
అడ్డగోలుగా సహజవాయు నిక్షేపాలు తవ్వుకుని తీసుకుపోతుండడంతో, ఆ దాని ప్రభావం తమపై పడుతోందని, తమ జీవనాధారం, కొంప, గోడు, గొడ్డు, గోద మొత్తం అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని భయబ్రాంతులు చెందుతున్నారు. విశాఖపట్టణంలో ఏడాదికి 0.65 సెంటీ మీటర్ల సముద్ర మట్టం పెరుగుతుండగా, గత నాలుగైదేళ్లలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఈ మూడు ప్రాంతాలు మాత్రం ఐదు అడుగుల లోతుకు భూమిలోకి దిగబడిపోయాయని చెబుతున్నారు.
ఈ మేరకు పలువురు నిపుణులతో కూడిన కృష్ణా, గోదావరి పరిరక్షణ సమితి ఆందోళణ వ్యక్తం చేస్తోంది. రాజకీయ పార్టీలన్నీ కలిపి దీనిపై పోరాడితేనే ఇక్కడి ప్రజల మనుగడ ఉంటుందని, లేని పక్షంలో వివిధ ప్రాంతాలకు వలసపోయి జీవనోపాధిని వెతుక్కోవడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సహజ వాయువు నిక్షేపాలు కేంద్రంతో కూడుకుని ఉన్న అంశం కావడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు చొరవ చూపిస్తుందనేది ప్రశ్నార్ధకమే!
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…
Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…