
తెలంగాణాలో అధికారంలో ఉన్న కేసీఆర్ కు వస్తే కొండ, పోతే వెంట్రుక అయితే చంద్రబాబు పరిస్థితి మాత్రం అలా కాదు. కేంద్రంలో నరేంద్ర మోడీ సొంతంగా అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడుని ముప్పతిప్పలు పెట్టడం ఖాయం. రాజకీయ ప్రత్యర్థుల మీద సిబిఐ, ఐటీ, ఈడీలని ప్రయోగించడం మోడీకి ఇష్టమైన ఆట. ఆ ఆటను ఇప్పటికే ఆయన ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టారు. సొంతంగా అధికారంలోకి వస్తే ఇక చంద్రబాబుకు కష్ట కాలం అనే అనుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వస్తే కొంతలో కొంత పరిస్థితి మెరుగు పడొచ్చు. దీనితో చంద్రబాబుకు మే 23న జీవన్మరణ సమస్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికోసమే చంద్రబాబు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. దీనితో మే23న ఏం జరగబోతుంది అనే ఆసక్తి ఇద్దరు చంద్రులలో ఉంది. ఏడు విడతలలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఇప్పటిదాకా నాలుగు విడతలు పూర్తి అయ్యాయి. మే 19న చివరి దశ ఎన్నికలు ఆ రోజు సాయంత్రం పోలింగ్ పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…