
శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు గనుక ఆమె చంద్రబాబు నాయుడుని ద్వేషించే వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ పదవిని సంపాదించుకోగలిగారు.
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీపై లక్ష్మీ పార్వతి కూడా స్పందిస్తూ చంద్రబాబు నాయుడిపై మరోసారి విషం చిమ్మారు. ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, “జూ.ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని కోరుకొనే వాళ్ళలో నేను ముందుంటాను. ఆయన మళ్ళీ రాజకీయాలలోకి వస్తే మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. జూ.ఎన్టీఆర్ రాజకీయాలలో ప్రవేశించి చంద్రబాబు నాయుడు చేతిలో నుంచి టిడిపిని స్వాధీనం చేసుకోవాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.
తమిళనాడు మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విజయ్ ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ…
కాంగ్రెస్ పార్టీకి మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షుడు కావచ్చు. కానీ దేశంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు అందరూ కూడా నేటికీ…