
ముఖ్యమంత్రి ఫడ్నవిస్ మాట్లాడుతూ… అమీర్ ఖాన్ రీల్ హీరో కాదని, రియల్ లైఫ్ లోనూ హీరోనేనని ప్రశంసలు కురిపించారు. కరవును తరిమికొట్టడంలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. అమీర్ ఖాన్ సత్యమేవ జయతే టీవీ టీం ‘పానీ ఫౌండేషన్’ను స్థాపించి ‘వాటర్ హార్వెస్టింగ్’పై ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పోటీలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ గ్రామాలు చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించి ‘సత్యమేవ జయతే వాటర్ కప్ 2016’ అవార్డులు అందిస్తుంది.
‘వాటర్ హార్వెస్టింగ్’పై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఏప్రిల్ 20 నుంచి జూన్ 5 వరకు ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం నాడు విజేత గ్రామాలకు బహుమతులు అందించారు. కోరేగాం తహశీల్లోని వేలు గ్రామం మొదటి బహుమతిగా 50 లక్షలు అందుకోగా, రెండో బహుమతి కింద 30 లక్షలను ఖపర్టోన్, జైగాం గ్రామాలు సంయుక్తంగా అందుకున్నాయి. అంబెజిగై తహశీల్లోని రాడి తండా, వరుద్ తహశీల్లోని వతోడాలు మూడో బహుమతిగా 20 లక్షలను సంయుక్తంగా అందుకున్నాయి.
మొదటి విడత పోటీల్లో భాగంగా మూడు జిల్లాలను భాగస్వామ్యం చేయగా మలి విడతలో 30 జిల్లాలను భాగస్వామ్యం చేయనున్నట్టు అమీర్ ఖాన్ తెలిపారు. ఒక టాప్ హీరోగానే కాకుండా సామాజిక లక్ష్యం కోసం పాటు పడుతున్న అమీర్ ఖాన్ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటూ బాలీవుడ్ మీడియా ప్రశంసలు కురిపిస్తుండగా, సోషల్ మీడియాలో కూడా అమీర్ పై అభిమానం ఓ రేంజ్ లో కురుస్తోంది.
The motion poster of Chandrayan has been unveiled, giving audiences a glimpse into a wildly…
Chennai Super Kings have been asked to consider a change in captaincy before IPL 2027,…