
‘బ్రహ్మోత్సవం’ ఫలితం రీత్యా పివిపికి మరో సినిమాను ప్రిన్స్ ఇచ్చారని, దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారన్న విషయం గతంలో వచ్చింది. అయితే దానిని ఈ రోజు పివిపి అధికారికంగా ధృవీకరించింది. అయితే ఈ మధ్యలో పూరీ జగన్నాధ్ “జనగణమన” టైటిల్ తో ప్రిన్స్ కాంభినేషన్ లో ఓ సినిమాను ప్రకటించడం, దీనికి మహేష్ నుండి కూడా స్పందన రావడం తదితర సంగతులు తెలిసినవే.
అయితే వంశీ పైడిపల్లి సినిమా తెరపైకి రావడంతో పూరీ సినిమా వెనక్కి వెళ్ళినట్లేనని ప్రిన్స్ చెప్పకనే చెప్పాడు. బహుశా ‘బ్రహ్మోత్సవం’ ద్వారా వచ్చిన నష్టాలను భర్తీ చేయడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారో ఏమో గానీ, వంశీ పైడిపల్లికి మాత్రం ప్రిన్స్ పుట్టినరోజు నాడు పండగ లాంటి వార్త బయటకు వచ్చింది. పివిపి – వంశీ కాంభినేషన్లో ఇప్పటికే ‘ఊపిరి’ సినిమా వచ్చి, ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
నేడు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు (ఏఎంసీఏ)కి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో…
తమిళనాడు ఎన్నికల ఫలితాల విడుదల తరువాత ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ రాజకీయం రంగు మార్చుకుంటుంది. నిన్న మొన్నటి వరకు ఐప్యాక్…