
అయితే సోషల్ మీడియా చేతిలో ఉంది కాబట్టి అక్కడ బానే పని అయ్యింది. కానీ అది అసలు ఓటర్లకు చేరలేకపోయింది. కారణం మీడియా ఆ విషయాన్నీ పెద్దగా పట్టించుకోకపోవడమే. గతంలో శ్రీ రెడ్డి వివాదం అప్పుడు పవన్ కళ్యాణ్ మీడియా మీద పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. అది మనసులో పెట్టుకుని మీడియా జనసేనను ఈ సారి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలో నెంబర్ వన్ ఛానల్ ఐన టీవీ9 అయితే జనసేన అనే పార్టీ ఉందనే విషయమే మర్చిపోయినట్టు వ్యవహరించింది.
నర్సాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు, నేతల సమావేశంలో పాల్గొన్న నాగబాబు కూడా వడదెబ్బ ఎపిసోడ్ ని గుర్తు చేసుకున్నారు. తన తమ్ముడు స్పృహ తప్పి పడిపోయాడన్న వార్త తెలియగానే తాను ఆందోళనకు గురయ్యానని, ఆ టెన్షన్లో ప్రచారం కూడా సరిగా చేయలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇదే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లో ఎవరికైనా జరిగితే దాన్ని ప్రచారం కోసం వాడుకుంటారని, కానీ తాము అలా చేయలేదని చెప్పుకొచ్చారు. నాగబాబు పైకి ఏమని చెప్పినా దానిని సరిగ్గా వాడుకోలేదు అనే బాధ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…