
విజయవాడ అని చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది సినిమా ధియేటర్లే. ఇటీవల నిర్మాణం అయిన పలు మల్టీప్లెక్స్ లకు తోడు గతంలో ఉన్న సినిమా ధియేటర్లే ‘ఎంటర్టైన్మెంట్’కు నిలయం. వీటన్నింటికి తోడుగా ఇప్పుడు నగరంలో ఓ మినీ ధియేటర్ కొలువు తీరనుంది. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో 130 మంది వీక్షించేలా ఓ ధియేటర్ ను నిర్మించారు.
ప్రయాణికుల సౌకర్యార్ధం నిర్మించిన ఈ ధియేటర్ ప్రజల ఆదరణ పొందితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన బస్టాండ్లలో ఇలాంటి ‘మినీ ధియేటర్’లను ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానం గల ఈ ధియేటర్లో పరిమిత సంఖ్యలో సీట్లు ఉండడంతో ప్రజల ఆదరణ చూరగొంటుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…