
ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ తెలుగుదేశంలోకి కిషోర్ రాబోతున్నాడనే వార్తలు పొలిటికల్ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను మాజీ మంత్రి గల్లా అరుణ, టీడీపీ నేత అమరనాథ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్ తదితరులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇటీవల నల్లారి సోదరుల తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, పరామర్శించడానికి వెళ్ళిన ‘గల్లా అరుణ అండ్ కో’ ఈ దిశగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. దీనిపై కిషోర్ కుమార్ రెడ్డి కూడా సుముఖంగానే ఉన్నట్లుగా సమాచారం.
అయితే రాజంపేట ఎంపీ టికెట్ తో పాటు, టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కావాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎంపీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత సుముఖత వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాల నేపధ్యంలో కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే వార్తలు బలపడుతున్నాయి. బహుశా మరికొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి సోదరుడి బాటలోనే కిరణ్ పయనిస్తారా? లేక ఏ ‘సేన’ కోసమైనా పరుగులు పెడతారా? అన్నది ప్రశ్నార్ధకం కానుంది.
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…