
మరోపక్క టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గం ఇన్ఛార్జి గౌత్ శిరీషను స్థానిక వైసీపీ నేతలు రాజకీయంగా ఎదుర్కొలేక ఆమె మంత్రి సీదిరి అప్పలరాజును ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడారని, మంత్రికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకుంటే పట్టణంలోని టిడిపి కార్యాలయాన్ని ఆదివారం ముట్టడిస్తామని స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు హెచ్చరించారు.
కానీ వారి బెదిరింపులకు గౌతు శిరీష కూడా ఏమాత్రం భయపడలేదు. “నేను ఇక్కడే టిడిపి కార్యాలయంలో కూర్చొని ఉంటాను. వైసీపీ గూండాలు ఎంతమంది వచ్చినా భయపడేది లేదు.. ఇక్కడి నుంచి కదిలేది లేదు. మేమేమీ పలాస జీడిపప్పు కాదు వైసీపీవాళ్ళు మమ్మల్ని నమిలేయడానికి,” అని ధీటుగా జవాబిచ్చి టిడిపి కార్యాలయంలో కూర్చోన్నారు. వైసీపీ కార్యకర్తలు టిడిపి కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నిస్తున్నారని తెలిసి, టిడిపి కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో తమ కార్యాలయం వద్దకు చేరుకొన్నారు. దీంతో ఆదివారం పలాసలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పలాసలో టిడిపి నేతలపై వైసీపీ దౌర్జన్యాల గురించి తెలుసుకొన్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం విమానంలో విశాఖకు చేరుకొని పలాసకు రోడ్డు మార్గంలో పలాసకు వెళుతుండగా, శ్రీకాకుళం వద్ద ఆయనను పోలీసులు అడ్డుకొని వెనక్కు వెళ్లిపోవాలని సూచించారు. నారా లోకేష్ వస్తున్న సంగతి తెలుసుకొని అప్పటికే భారీ సంఖ్యలో టిడిపి నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో, పోలీసులకు వారికీ మద్య తోపులాటలు జరిగాయి.
పోలీసులు అడ్డుకోవడంతో నారా లోకేష్, టిడిపి నేతలు కళా వెంకట్రావు, చిన్న రాజప్ప తదితరులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. “పలాసలో మా పార్టీ నేత ఇల్లు కూల్చివేస్తూ, పార్టీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడులు చేస్తుంటే వారిని అడ్డుకోవవలసిన మీరు మమ్మల్ని ఎందుకు అద్దుకొంటున్నారని,” నారా లోకేష్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు నారా లోకేష్ను అదుపులో తీసుకొని శ్రీకాకుళం నుంచి వెనక్కు తీసుకువెళ్లి విశాఖకు వెళ్ళేదారిలో రణస్థలం వద్ద విడిచిపెట్టారు. కళా వెంకట్రావు, చిన్న రాజప్ప తదితరులను ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం పలాసలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తమిళనాడు సిఎంగా విజయ్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే ఎన్నికలలో ఇచ్చిన మూడు హామీలను అమలు చేస్తూ మూడు…
In an industry where success often decides everything, some filmmakers continue getting opportunities because of…