
అయితే ఆగష్టు 12వ తేదీన విడుదల అని ప్రకటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్ర యూనిట్ కు మాత్రం మరో అవకాశం లేకుండా పోయింది. దీంతో సెగలు కక్కే ఎండలో కూడా షూటింగ్ జరుపుకుంటోంది చిత్ర యూనిట్. దీనికి సంబంధించి ఒక ఫోటోను షేర్ చేసుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్… ‘జనతా గ్యారేజ్’ సిబ్బందికి ‘హ్యాట్సాఫ్’ చెప్పారు. మండుతున్న ఎండలో కష్టపడుతున్న చిత్ర యూనిట్ ను గుర్తించి, అభినందించడం బహుశా వారికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.
నిజానికి షూటింగ్ సమయంలో ఎక్కువగా కష్టపడేది కూడా వారే. హీరో, హీరోయిన్, ఇతర ముఖ్యులకు ఏసి బస్సులు గానీ, కార్లు గానీ ఉంటాయి. షాట్ అయిపోగానే వారంతా వాహనాల్లోకి వెళ్ళిపోయి సేద తీరుతుంటారు. కానీ సిబ్బంది మాత్రం తదుపరి షాట్ కు మళ్ళీ తమ పనిలో నిమగ్నమవుతారు. సాధారణ పరిస్థితుల్లో అయితే, పర్వాలేదు గానీ, మనుషులను కబళించి వేస్తున్న ఈ ఎండలో పని చేయడమంటే… నిజంగా జూనియర్ చెప్పిన “హ్యాట్సాఫ్”కు ప్రతి ఒక్కరూ అర్హులే!
Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…