
దీనితో ఉభయ గోదావరి జిల్లాలలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయదుంధుబి మోగించింది. పవన్ కళ్యాణ్ తనని తాను కులరహితం అని చెప్పుకున్నారు, నాది రెల్లి కులం అన్నారు. అయితే కాపులు ఎక్కువగా ఉండే జిల్లాలలోనే ఎక్కువ ఫోకస్ చెయ్యడం, వారు నిర్ణయాత్మక స్థితిలో ఉండే నియోజకవర్గాలలోనే తానూ, తన సోదరుడు నాగబాబు పోటీ చెయ్యడం ద్వారా తన మాటలకు చేతలకు పొంతన లేదు అని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. అభిమానులు ఒప్పుకోకపోవచ్చు కాకపోతే ప్రజలలోకి వెళ్లిన మెస్సేజ్ అయితే ఇదే.
అప్పట్లో చిరంజీవి కూడా ఇదే చేశారు. అయితే అప్పుడు ఆయనకు 75 లక్షల ఓట్లు ఇచ్చిన ప్రజలు ఈ సారి జనసేనకు కేవలం 16.76 లక్షల ఓట్లు (5.35% ఓట్ షేర్). ఆ పార్టీ పోటీ చేసిన 137 సీట్లలో 121 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. కాపులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో తమకు సంస్థాగతంగా మద్దతు ఇచ్చిన బీసీల ఓట్లుకూడా పోగొట్టుకుంది టీడీపీ. మొత్తానికి చాలా కాలం తరువాత ఆంధ్రప్రదేశ్ లో కులరాజకీయాలు పని చెయ్యకపోవడం శుభపరిణామం.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…