
దీంతో తాజాగా వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గత ఎన్నికలలో బరిలోకి దిగకుండా బయట నుండి టిడిపి – బిజెపిలకు సహకారం అందించిన పవన్ కళ్యాణ్, ఈ సారి మాత్రం ‘సమరమే’ అంటున్నారు. “ఎన్నికల యుద్ధం ఒకవేళ ముందుగా వస్తే జన‘సేన’ సిద్ధమే” అంటూ ట్వీట్ చేయడం… పవన్ అభిమానుల్లో ఉత్సాహం నింపడంతో పాటు, రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది. అంటే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ నిరీక్షిస్తున్న సంకేతాలు ఈ ట్వీట్ ద్వారా వెళ్ళడంతో, జనసేనలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉందన్న నమ్మకం వెళ్ళింది.
అయితే మరో వైపు దీనిపై వైసీపీ వర్గం ‘సైలెంట్’గా ఉండడం విస్మయాన్ని కలిగిస్తోంది. మొన్నటివరకు దమ్ముంటే ఎన్నికలకు రండి… అంటూ ఛాలెంజ్ లు విసిరిన జగన్, స్వయంగా ముఖ్యమంత్రి నోట నుండే ముందస్తు ఎన్నికల మాట వస్తే, దానిపై అభిప్రాయం చెప్పకపోవడంతో, మానసికంగా వైసీపీ ఎన్నికలకు సిద్ధంగా లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. అంటే ఇప్పటివరకు చేసినవన్నీ ‘మేకపోతు గాంభీర్యాలేనని’ ప్రజలకు అవగతమయ్యే పరిస్థితి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పవన్ బరిలోకి దిగడం ఏ పార్టీ నష్టం చేకూరుస్తుందో ఇప్పుడే చెప్పలేం గానీ, ప్రస్తుతం చేసిన ట్వీట్ మాత్రం, వైసీపీ వర్గాలను వెనక్కి నెట్టింది.
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…
Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…