
ఇప్పుడు ఏకంగా బీజేపీ, వైకాపా మధ్య పొత్తు చర్చలు జరుపుతున్నారట. సాక్షాత్తు ఆయన ముందే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జగన్ నమ్మినబంటు విజయ సాయి రెడ్డి వినమ్రంగా కూర్చున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సోము వీర్రాజు బీజేపీలోని టీడీపీ వ్యతిరేక వర్గానికి న్యాయకత్వం వహిస్తూ ప్రభుత్వాన్ని తరచూ ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
బీజేపీ అధినాయకత్వానికి తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క పరమపవిత్రంగా ఉండాల్సిన పీఠాలు ఇలా రాజకీయ చర్చలకు నిలయం చెయ్యడం ఎంతవరకు సమంజసమో ఆ స్వామికూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి వాటి వల్ల మొత్తం హిందూ మతానికే చెడ్డ పేరు వస్తుంది.
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో చిరకాలం కలిసి పని చేసిన ఉద్యోగుల మద్య అనుబందం ఏర్పడటం, ఒకరు వెళ్ళిపోతుంటే మిగిలినవారు బాధ…
Nani seems to be ready for a change after spending the last few years in…