
ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన రాజకీయ, సినీ ప్రముఖుల నడుమ ఓ ఆసక్తికర దృశ్యం దర్శనమిచ్చింది. వేడుకకు హాజరై తిరిగి వెళుతున్న సందర్భంగా ఒకే సమయంలో బయలుదేరిన కేసీఆర్ మరియు దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మగా పేరొందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావులు ఒకరినొకరు పలకరించుకున్నారు. అయితే ఈ దృశ్యం పలకరింపు వరకే పరిమితమైతే, వార్తలకు పెద్దగా ప్రాధాన్యత దక్కేది కాదు.
పలకరింపులతో ఆగని కేసీఆర్ – కేవీపీలు ఒకరి చెవిలో మరొకరు ఏదో విషయం చెబుతూ గుసగుసలాడుకున్న దృశ్యం అక్కడకు విచ్చేసిన ప్రముఖులను ఆకర్షించింది. ఆసక్తిగా మారిన వీరిద్దరి గుసగుసల ఆంతర్యం ఏమిటో ఆ “జగన్నాధుడి”కే తెలియాలి అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. అవునులేండి… చక్రం తిప్పేవారికే కదా అది ఎలా తిరుగుతుందో తెలిసేది..!
The motion poster of Chandrayan has been unveiled, giving audiences a glimpse into a wildly…
Chennai Super Kings have been asked to consider a change in captaincy before IPL 2027,…