
టాస్ గెలిచి కోల్ కతాకు బ్యాటింగ్ అప్పగించగా, 187 పరుగుల భారీ స్కోర్ నైట్ రైడర్స్ సాధించింది. ఊతప్ప 72, ఓపెనర్ నరైన్ 42, గంభీర్ 33, పాండే 24 పరుగులతో రాణించారు. అయితే ఓపెనర్ నరైన్ నైట్ రైడర్స్ బౌలర్లపై విరుచుకుపడడంతో, తొలి మూడు ఓవర్లలోనే 44 పరుగులు వచ్చాయి. అందులో నరైన్ 17 బంతులను ఎదుర్కొని 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 42 పరుగులు చేసి, భారీ స్కోర్ కు పునాది వేసాడు. ఆ తర్వాత ఈ ఒరవడిని ఊతప్ప, గంభీర్, పాండేలు కొనసాగించారు.
ఇక, భారీ లక్ష్య చేధనను ధాటిగా ఆరంభించింది గుజరాత్. ఓపెనర్లు ఫించ్, మెక్కల్లంలు భారీ షాట్లతో విరుచుకుపడడంతో తొలి 5వ ఓవర్లో 62 పరుగులు వచ్చేసాయి. ఈ తరుణంలో మ్యాచ్ కు వరుణుడు అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి వర్తిస్తుందని అంతా భావించారు. అయితే ఆ తర్వాత వరుణ దేవుడు కటాక్షించడంతో మొదలైన మ్యాచ్ లో కోల్ కతా వరుసగా రెండు వికెట్లను పడగొట్టి, మ్యాచ్ పై పట్టు సాధించింది. అయితే క్రీజులో ఉన్న కెప్టెన్ రైనా మ్యాచ్ ను చేజారిపోకుండా చూడడంలో విజయవంతం అయ్యాడు.
భారీ షాట్లతో చెలరేగిన రైనా 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో ఎండ్ లో విరామం లేకుండా వికెట్లు పడుతున్నా, ఒంటరి పోరాటం చేసి ప్లే ఆఫ్స్ కు అర్హత పొందే అవకాశాలను నిలుపుకున్నాడు. ఈ విజయంతో ఆడిన 6 మ్యాచ్ లలో రెండు విజయాలు సాధించిన పంజాబ్, బెంగుళూరు జట్ల సరసన గుజరాత్ కూడా నిలిచింది. రైనా తిరిగి ఫాంలోకి రావడంతో గుజరాత్ జట్టు అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…
Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…