
ఎప్పుడైనా రాజ్యసభ ఛైర్మన్, డెప్యూటీ ఛైర్మన్ ఇద్దరూ రానప్పుడు వైస్ ఛైర్మన్గా ఎంపికైన ఎంపీ రాజ్యసభను నడిపించడం ఆనవాయితీ. ఈరోజు ఛైర్మన్, డెప్యూటీ ఛైర్మన్ ఇద్దరూ రాకపోవడంతో విజయసాయి రెడ్డి రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్ హోదాలో సభాధ్యక్షస్థానంలో కూర్చొని సభను నడిపించారు.
వెంకయ్య నాయుడు తరువాత మరో తెలుగు వ్యక్తి ఆ సర్వోన్నతమైన స్థానంలో కూర్చొని సభను నడిపించడం చాలా గొప్ప విషయమే కానీ అక్రమాస్తుల కేసులలో ఏ-2గా ఉండి 16 నెలలు జైలులో గడిపివచ్చిన విజయసాయి రెడ్డి ఆ సర్వోన్నతమైన స్థానంలో కూర్చొని చట్టసభను నడిపించడం దౌర్భాగ్యం అనుకోవాలేమో? అని టిడిపి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు సిఎంగా విజయ్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే ఎన్నికలలో ఇచ్చిన మూడు హామీలను అమలు చేస్తూ మూడు…
In an industry where success often decides everything, some filmmakers continue getting opportunities because of…