జగన్ ఉన్న చోట ప్రజాస్వామ్యానికి చోటు ఉంటుందా?

చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి దుర్మార్గపు పనులు అనే సామెతకు పూర్తి న్యాయం చేసి చూపిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్. తానూ అధికారంలో ఉన్నప్పుడు ఒప్పైనా నీతి జగన్ కు ఇప్పుడు తప్పుగా కనిపిస్తుందట.

ADVERTISEMENT

గతం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ మీద విమర్శ చేసిన నేరానికి టీడీపీ జాతీయ ప్రతినిధి పట్టాభి ని అరెస్టు చేసి వైసీపీ ట్రీట్మెంట్ ఇచ్చి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడింది వైసీపీ ప్రభుత్వం.

అయితే ఇదంతా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కే అంటూ, నన్ను విమర్శిస్తే నా పార్టీ క్యాడర్ కు బీపీలు రావడం దాడులు చేయడం సహజమే అంటూ నాడు హింసను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన జగన్ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో శుద్ధ ప్రవచనాలు వల్లెవేస్తున్నారు.

ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పై హత్య ప్రయత్నం చేస్తాను అంటూ పరోక్షంగా మీడియా సాక్షిగా హెచ్చరించిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఒక ముఖ్యమంత్రిని చంపుతా అంటూ బెదిరించిన నేరానికి గాను సదరు వైసీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసారు నాగార్జున.

ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తేనే అరెస్టు చేసి లాఠీకి పనిచెప్పిన వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి బాబు ప్రాణాలను ఆ ఏడూ కొండలవాడు కూడా కాపాడలేడు అంటూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించిన నాగార్జున యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని వైసీపీ తప్పుబడుతూ తన సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేసింది.

కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన నెల రోజులలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయ్యిందంటూ, శాంతి భద్రతలు మంట కలిసిపోయాయంటూ నానా యాగీ చేస్తుంది వైసీపీ. అసలు జగన్ ఉన్న చోట ప్రజాస్వామ్యానికి చోటు ఉంటుందా? ఉంటే గత ఐదేళ్లల్లో ఏపీలో జరిగిన విధ్వంసానికి ఏ పేరు పెట్టాలి?

వ్యక్తిగత గొడవలను తీసుకొచ్చి రాజకీయ రంగు పూసి తమ పార్టీని బలపరుచుకోవడానికి రాష్ట్ర ప్రతిష్టను ఢిల్లీ విధుల్లో దిగజార్చడానికి సైతం వెనుకాడని జగన్ మనస్తత్వాన్ని ఏమని వర్ణించాలి? వైసీపీ ప్రభుత్వంలో సొంత చెల్లికి తల్లికే రక్షణ కల్పించలేని జగన్ ఇప్పుడు శాంతి భద్రతల అంశాన్ని భుజానికెత్తుకోవడాన్ని ఏ వ్యూహంలో భాగమనాలి?

జగన్ రాష్ట్రంలో బయటకొచ్చి వేసే ప్రతి అడుగు రాష్ట్ర ప్రతిష్టను వెనక్కిలాగిన్నట్టే అంటూ గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజమని జగన్ తన చర్యలతో నిరూపిస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

No One Can Touch Allu Arjun Then?

Allu Arjun is very particular when it comes to the technical aspects of his films…

8 minutes ago

రెండు సీట్ల వీసీకే చేతిలో విజయ్‌ భవిష్యత్‌!

తమిళనాడులో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే పార్టీ, 73 సీట్లు గెలుచుకున్న డీఎంకే, 53 సీట్లు గెలుచుకున్న అన్నాడీఎంకే మూడూ…

1 hour ago