Telugu

అనంతబాబు చిత్ర పఠానికి పాలాభిషేకాలు

కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అతనిని వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కానీ నేటికీ వైసీపీ నేతలు అతనితో టచ్‌లోనే ఉన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేటలో సోమవారం గడపగడపకు కార్యక్రమం జరిగింది. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అనంత బాబు అనుచరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ‘అనంతబాబు జిందాబాద్…’ అని నినాదాలు చేస్తూ ఆర్అండ్‌బీ ప్రధాన రహదారిపై అతని చిత్ర పఠంతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అతని చిత్ర పఠానికి పాలాభిషేకం చేశారు.

ADVERTISEMENT

డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు అనంత బాబు స్వయంగా ఒప్పుకొని జైల్లో ఉండగా, అతను ఏదో ఘనకార్యం చేసినట్లుగా అతని అనుచరులు అతని చిత్ర పఠంతో ర్యాలీ నిర్వహించి పాలాభిషేకం చేయడమే విడ్డూరం అనుకొంటే, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఓ ఎమ్మెల్యే పాల్గొంటున్న అధికారిక కార్యక్రమంలో ఓ హంతకుడికి వైసీపీ కార్యకర్తలు జిందాబాద్ నినాదాలు చేస్తుంటే, ఎమ్మెల్యే వారించకపోవడం, పోలీసులు పట్టించుకోకపోవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది.

తద్వారా అనంతబాబుకి వైసీపీ ప్రభుత్వం పూర్తి అండదండలున్నాయని స్పష్టం అవుతోంది. అటువంటప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరుగుతుందని, అనంతబాబుకి శిక్ష పడుతుందని ఏవిదంగా నమ్మగలము?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

సిఎం విజయ్‌.. తొలి సంతకాలు… తొలి విమర్శలు!

తమిళనాడు సిఎంగా విజయ్‌ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే ఎన్నికలలో ఇచ్చిన మూడు హామీలను అమలు చేస్తూ మూడు…

2 minutes ago

Nithiin-Anudeep’s Big Gamble: Is Reinvention Possible?

In an industry where success often decides everything, some filmmakers continue getting opportunities because of…

19 minutes ago