
“ఎవడూ చెప్పలా… ఆయనిష్టం వచ్చినట్టుగా… ఆయన ప్రాజెక్టులు కడతా ఉన్నాడు కాబట్టి… ప్రాజెక్టుల్లో నిల్వ ఉండే నీటిని లెక్కగట్టుకుని, ఇది నా అవసరం, ఇవీ నా కేటాయింపులు, నేనే ఈ నీళ్లు తీసుకుంటా, మిగిలితేనే మీకు పంపిస్తా అంటూ… ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్న తీరు… ధర్మమేనా అని చెప్పి నేను అడుగుతావున్నా…” సమస్యను పరిష్కరించేందుకు అటు కేసీఆర్, ఇటు చంద్రబాబు ముందడుగు వేయకుంటే, రెండు రాష్ట్రాల మధ్యా ‘భారత్ – పాక్ సరిహద్దు’ ఏర్పడుతుందని హెచ్చరించారు.
అయితే జగన్ చేసిన ఈ విమర్శల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణాలో వైసీపీ పూర్తిగా ఖాళీ కావడంతో ఇక పార్టీపై దృష్టి పెట్టాల్సిన పని లేకపోవడంతో… రాజకీయంగా కేసీఆర్ అవసరం లేదన్న నిర్ణయంతోనే జగన్ తీవ్ర విమర్శలకు దిగారన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అదీ గాక, ఏపీ ప్రయోజనాలను దెబ్బ కొడుతున్న కేసీఆర్ నిర్ణయాలను విభేదించని పక్షంలో ప్రజలలో తప్పుడు సంకేతాలను పంపినట్లుగా అవుతుందని… తప్పని పరిస్థితులలో విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద కేసీఆర్ ను జగన్ విమర్శించడం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది.
For the first time in a long time, there is genuine curiosity about whether Prabhas…
Goodachari 2 is one of those Telugu films that has built strong expectations without relying…