
గనుల కేటాయింపు విషయంలో ఆరోపణలు ఎదురుకున్న అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ప్రస్తుతం తెలంగాణలో విధులు నిర్వహిస్తూ, ఏపీ కేడర్ కు బదిలీ కావడానికి డిప్యుటేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే దీనివల్ల జగన్ కు అనవసరమైన చెడ్డ పేరు రావడం ఖాయం. సరైన పాలనతో గతంలో తన మీద ఉన్న మచ్చలు తుడుచుకుని ప్రయత్నం చెయ్యాల్సింది పోయి మళ్ళీ వారినే తెచ్చి పెడితే అనవసరమైన వివాదాలకు కేంద్రబిందువు కావడమే. జగన్ ముందు అనేక సవాళ్ళు ఉన్న తరుణంలో ఇటువంటివి పూర్తిగా అనవసరమనే చెప్పుకోవాలి.
ఇటువంటి చిన్న చిన్న తప్పులే తెలుగుదేశం, పార్టీకి తిరిగి ఊపిరి ఊదే అవకాశం ఉంది. మరోవైపు ఈనెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో వై జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నవరత్నాల పేరిట ప్రజలకు చేసిన తొమ్మిది వాగ్దానాల అమలు చెయ్యడంలోనే జగన్ పాలనను ప్రజలు అంచనా వెయ్యబోతున్నారు.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…