
ఇక్కడ జగనన్న కూడా బటన్ నొక్కుతూ, “మన అక్కలు… చెల్లెమ్మలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకొంటున్నాను,” అంటూ రాఖీ కట్టకపోయినా అమ్మఒడి, విద్యాదీవెన అంటూ లక్షల కోట్లు చేతిలో పెడుతూనే ఉన్నారు. ఈరోజే జగనన్న మరోసారి బటన్ నొక్కి విద్యా దీవెన అంటూ రూ.694 కోట్లు పంచిపెట్టేశారు. ఈ సందర్భంగా బాపట్లలో విద్యార్ధినుల నెత్తిన చెయ్యి పెట్టి జగనన్న ఆశీర్వదించారు.
తన అన్న ఇంత ఉదార హృదయుడని గ్రహించలేకనో, అపార్ధం చేసుకొన్నారో తెలీదు కానీ ఇదివరకు ఏటా రాఖీ పండుగనాడు ‘జగనన్న’కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకొనే వైఎస్ షర్మిల, గురి తప్పిన బాణంలా ఎక్కడో వికారాబాద్లో పాదయాత్ర చేసుకొంటున్నారు. అక్కడే తెలంగాణ ప్రజలలో కొత్త సోదరులను వెతుక్కొంటూ ముందుకు సాగిపోతున్నారు పాపం!
Aamir Khan is reportedly teaming up with Ashutosh Gowariker for a new sports drama based…
An H-4 EAD application reportedly turned into a stressful experience for one family living in…