
ఇప్పటికే చెల్లి వైఎస్ షర్మిలను దూరం పెట్టడంతో ఆమె తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకొన్నారు. ఇప్పుడు తల్లిని కూడా వైసీపీలో నుంచి జగన్ బయటకు సాగనంపబోతున్నారని ఆ వార్తల సారాంశం.
ఏవిదంగా అంటే ఆమె వైఎస్ షర్మిల పార్టీకి కూడా గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు కనుక ఏపీలో వైసీపీకి ఆమె గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరించడం సరికాదు. కనుక ఆమె చేత రాజీనామా చేయించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతీ రెండేళ్ళకు ఓ సారి వైసీపీ అధ్యక్షుడుని ఎన్నుకొనేందుకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియకు కూడా స్వస్తి పలకబోతున్నట్లు ఆ వార్తల సారాంశం. వైసీపీకి జగన్మోహన్ రెడ్డి శాస్విత అధ్యక్షుడిగా రేపటి నుంచి జరిగే ప్లీనరీలో ప్రకటించవచ్చని తెలుస్తోంది.
దీని కోసం జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులతో మాట్లాడారని, వారు పార్టీ రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేసుకొంటే సరిపోతుందని చెప్పినట్లు తెలుస్తోంది. నిప్పు లేనిదే పొగరాదు కనుక ఈ వార్తలలో నిజానిజాలు రేపు మొదలయ్యే వైసీపీ ప్లీనరీ సమావేశంలో తేలిపోతాయి.
Megastar Chiranjeevi recently met acclaimed Malayalam filmmaker Tharun Moorthy at his Hyderabad residence, sparking immediate…
Ram Charan's Peddi, directed by Buchi Babu Sana, has already emerged as one of the…