
ఈ నేపథ్యంలో రోజాకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటు కౌంటర్ ఇచ్చారు. జగన్ దర్శకత్వంలో రోజా ‘జబర్దస్త్-2’ చేస్తున్నారని… జగన్, రోజాలు 420 లని, ఇటువంటి వాళ్లా చంద్రబాబును, లోకేష్ ను విమర్శించేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన నాటి నేతలు కొండా సురేఖ, సబ్బం హరి, కొణతాల రామకృష్ణ కు ఏ గతి పట్టిందో, చివరకు రోజాకు అదే గతి పట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.
అలాగే వైసీపీ అధినేత జగన్ ది ఒక సైకో మెంటాలిటీ అని, ఆంధప్రదేశ్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, జగన్ కు దమ్ముంటే పులివెందుల సీటు ఖాళీ చేయాలని, తమ యువనేత నారా లోకేష్ ఆ స్థానంలో పోటీ చేసి గెలుస్తారని ఈ సందర్భంగా సవాల్ విసిరారు బుద్దా వెంకన్న. ‘జబర్దస్త్’ షో చేయడం కోసమే రోజాను జగన్ విజయవాడకు పంపుతున్నారని చురకలంటించారు.
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…
Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…