
రాష్ట్రంలో ఇప్పటికే ఈ వైసీపీ రంగుల రచ్చ హైకోర్టుని తాకింది. గణేష్ ఉత్సవాలకి జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వివాదాస్పదంగా మారాయి. రోడ్ల మీద గణపతి ప్రతిమ పెట్టాలంటే రోజుకు వెయ్యి రూపాయలు చెల్లించాలనే, నిబంధన అమలు చేస్తున్నారంటూ ఇప్పటికే టిడిపి నేత బోండా ఉమా ప్రభుత్వంపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టారు.
రాజకీయాలలో ప్రచారానికి కాదేది అనర్హం అన్న చందంగా తయారయ్యాయి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు. “తినగా తినగా…. బూరెలు కూడా చేదుగా” ఉంటాయనే సామెత మాదిరే ప్రచారం కూడా హద్దులు దాటితే అసలుకే ఎసరు వస్తుందనే అంశాన్ని అటు పార్టీ పెద్దలు.., ఇటు పార్టీ కార్యకర్తలు దృష్టిలో పెట్టుకుని మెలగడం శ్రేయస్కరం అని గుర్తుంచుకోవాలి.
ఏ రాజకీయ పార్టీకైనా.., వారి అనుచరులకైనా పార్టీ మీద ప్రేమ ఉండడం తప్పుకాదు.,కానీ వారి ఇష్టాన్ని భక్తుల మీద రుద్దాలని చూడడమే విమర్శలకు తావిస్తుంది. ఇటువంటి కార్యక్రమాల వలన ప్రజలలో పార్టీ పట్ల., ఆ పార్టీ నేతల పట్ల ఏసడింపే తప్ప మరొకటి ఆశించడం అత్యాశే అవుతుంది.
తమిళనాడు మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విజయ్ ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ…
కాంగ్రెస్ పార్టీకి మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షుడు కావచ్చు. కానీ దేశంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు అందరూ కూడా నేటికీ…