
అక్కడ పౌల్ట్రీ ఫామ్ లు పెట్టేందుకు 100 ఎకరాల భూమిని, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తనకు తక్కువ ధరకే కేటాయించారని బండ్ల తెలిపాడు. అలాగే దీని కోసం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సహకరించారని కూడా వివరించారు. అయితే ఇదే సమయంలో… జరుగుతున్న ఎన్నికలలో అఖిలేష్ ముఖ్యమంత్రి అయితేనే అక్కడ పౌల్ట్రీ పెడతానని, ఒకవేళ అఖిలేష్ ఓడిపోతే ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆయన గెలిచిన తర్వాత పెడతానని చెప్పాడు.
మరి తాజాగా వెల్లడైన ఫలితాలలో సమాజ్ వాదీ పార్టీ ఘోర ఓటమిని చవిచూడగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. దీంతో బండ్ల గణేష్ వ్యాపార విస్తరణ ప్రస్తుతానికి ఆగిపోయినట్టే. అయితే బండ్ల గణేష్ కు ఈ పరిస్థితి రావడానికి పరోక్షంగా నరేంద్ర మోడీయే కారణంగా నిలుస్తోంది. ‘నమో’ మంత్రంతో యూపీ ప్రజానీకం అంతా మోడీ వెంట నిలవడంతో, అనూహ్యంగా బిజెపి పగ్గాలు చేపట్టింది. దీంతో బండ్ల గణేష్ వ్యాపార విస్తరణకు బ్రేక్ పడింది.
BOTTOM LINE Taapsee Struggles to Salvage a Bland Thriller PLATFORM Netflix RUNTIME 1Hr 56Mins What…
The BCCI is looking at a special ODI series in South Africa before the 2027…