
ఓటుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తుతో తాము ఏకీభవిస్తున్నామని… ఈ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ అవసరం లేదని స్పష్టం చేస్తూ…. స్క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఓటుకు నోటు కేసు నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయట పడినట్లయ్యింది. చంద్రబాబు న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం… ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ తాజా తీర్పుతో రాజకీయంగా మరోసారి వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.
ఒక రకంగా చూస్తే… తెలుగుదేశం పార్టీకి మంచి చేసినట్లయ్యింది. కోర్టు ద్వారానే చంద్రబాబుకు ప్రమేయం లేదని చెప్పించినట్లయ్యింది. తాజా పరిణామాలు వైసీపీ అధినేత రాజకీయ అవగాహనకు నిదర్శనంగా నిలుస్తున్నాయని, ఇలాంటి అనుభవరాహిత్యపు రాజకీయాలే పార్టీ కొంప ముంచుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు లాజిక్ లతో మ్యాజిక్ చేసే ఉండవల్లి దూకుడుకు కూడా హైకోర్ట్ బ్రేక్ వేసినట్లయ్యింది.
రాజకీయాలలో ఎల్లప్పుడూ శత్రుత్వమే కాదు మర్యాదలు, సత్ సాంప్రదాయాలు, ఆనవాయితీలు కూడా పాటించడం అవసరం. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి,…
Social media was buzzing recently with news that Ranveer Singh bought the rights to Amish…