
‘జనతా గ్యారేజ్’ వంద రోజులు పూర్తయితే గానీ, ఈ సినిమా నుండి జూనియర్ బయటపడలేదేమో అన్నట్లుగా… ఆ వంద రోజుల పోస్టర్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ నుండి ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది. జూనియర్ ఎన్టీఆర్ 27వ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మా సొంత బ్యానర్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే నిర్మించనున్నామని కళ్యాణ్ రామ్ చేసిన ట్వీట్ తో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఈ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని, తారక్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోతుందన్న టాక్ అప్పుడే ఊపందుకుంది.
ఇదిలా ఉంటే… అసలు బాబీ స్క్రిప్ట్ ను ఓకే చేయడం వెనుక కూడా ‘జనతా గ్యారేజ్’ కొరటాల శివ ఉన్నారని, ఈ కధను ఎంపిక చేయడంలోనూ, ఈ కధకు కొన్ని సూచనలు చేయడంలోనూ కొరటాల పాత్ర ఉందనేది సినీ జనాల టాక్. తొలి చిత్రం ‘పవర్’తో కమర్షియల్ సక్సెస్ అందుకున్న బాబీ, మలిచిత్రం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’తో మాత్రం తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. మరి ముచ్చటగా ప్రారంభం కాబోతున్న మూడవ చిత్రం ఎలాంటి అనుభూతులను పంచుతుందో వేచిచూడాలి.
The former chief minister of Andhra Pradesh YS Jagan appears to have collectively decided that…
గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…