వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మించిన “ఊపిరి” ఆడియో వేడుక వైభవంగా జరుగుతోంది. వరుసగా విడుదల అవుతున్న పాటల వీడియో టీజర్స్ ప్రేక్షకులకు కన్నుల విందుగా ఉండగా, ఈ సినిమాలో తమన్నా అద్భుతంగా కనిపించిన ఒక పాటను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పాటను విడుదల చేయాల్సిందిగా ఒక రిమోట్ ను దర్శకేంద్రుడి చేతికి యాంకర్ సుమ ఇవ్వగా, ఆ రిమోట్ ను నిర్మాత అశ్వనీదత్ చేతికి అందించి, సుమ చెవిలో… ‘పూలు, పళ్ళు అయితే నేనే విసిరేవాడ్ని…’ అంటూ చెప్పగా, దాన్ని సుమ మళ్ళీ బహిరంగంగా పలికింది. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియంలో నవ్వులు పూలు పూసాయి.
ఆ తర్వాత ప్రసంగించిన… దర్శకేంద్రుడు… “శివ సమయంలో నాగార్జున ఎప్పుడూ సీరియస్ గా ఉండేవాడని, కానీ ఇప్పడు నవ్వుతూ కనపడుతున్నాడని, నాగ్ నీ నవ్వు బాగుంటుంది, నువ్వు ఎప్పుడూ అలాగే నవ్వుతూ ఉండాలని, ఈ ఊపిరి సినిమా విజయవంతం కావాలని” ఆకాక్షించారు.



