
సూట్ కేస్ కంపెనీలతో జగన్ కున్న సంబంధాలపై ఆరా తీసే ప్రయత్నం చేస్తోంది. నల్లధనం, అక్రమ లావాదేవీలపై ఉక్కు పాదం మోపిన కేంద్ర ప్రభుత్వం, అక్రమార్కుల భరతం పట్టడానికి అన్ని అంశాలను పరిశీలిస్తూ ముందుకు వెళుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల పలు ఆదేశాలు జారీ చేయడంతో ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. దీంతో రాబోయే రోజులన్నీ వైకాపా అధినేత వైఎస్ జగన్ కు నిద్ర లేని రాత్రులను మిగల్చనున్నాయని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
కడప జిల్లాలో అన్ని వర్గాలూ ఒక తాటిపై నడుస్తున్నాయని, అభివృద్ధే థ్యేయంగా ముందుకు సాగుతున్నామని, కడప జిల్లాలో ఇక జగన్ ఆధిపత్యాన్ని కొనసాగనివ్వబోమని గంటా స్పష్టం చేశారు. మరో వైపు ఈడీ నుండి ఊహించని ఈ షాక్ తో వైసీపీలో కలకలం మొదలైంది. ఓ పక్కన వైసీపీ నుండి టిడిపిలోకి వెళ్ళిన వారిలో ఏకంగా నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం వైసీపీ వర్గాలను తీవ్రంగా నిరుత్సాహపరచడం ఒక అంశమైతే, మరో వైపు జగన్ పై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు ఉంటాయోనన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…
Well, the inevitable has happened as the Telangana government under the leadership of Chief minister…