
ఇక, టైటిల్ విషయానికి వచ్చే సరికి, ముందుగా అందిన సమాచారం ప్రకారమే… “జై లవకుశ” అనే నామకరణంతో శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పండగ శుభాకాంక్షలు చెప్తూ యంగ్ విడుదల చేసిన మోషన్ పిక్చర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆలాగే ఈ మోషన్ పిక్చర్ ద్వారా తన ఫ్యాన్స్ కు మరో తీపికబురును కూడా అందజేశాడు జూనియర్.
ముందుగా చెప్పినట్లుగా ఈ సినిమాను ఎలాంటి ఆలస్యం చేయకుండా, ఈ ఏడాదిలోనే విడుదల చేయబోతున్నాడు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఈ సినిమా ప్రారంభం కావడానికి చాలా సమయం తీసుకోవడంతో అనుకున్న సమయానికి విడుదల అవుతుందో లేదో అన్న సందేహం సినీ జనాల్లో కూడా వ్యక్తమయ్యింది. అయితే అందులో మరో సందేహానికి ఆస్కారం లేకుండా… 2017 విడుదల అని చిత్ర యూనిట్ స్పష్టం చేయడంతో, ఈ ఏడాదిలోనే యంగ్ టైగర్ ‘ట్రిపుల్ యాక్షన్’ చూపించబోతున్నారు.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…