‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదల తర్వాత యుకే వెళ్ళిన మహేష్, ప్రశాంతంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. మరో ఒకటి, రెండు రోజుల్లో మళ్ళీ తిరిగి వచ్చి మురుగదాస్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్న మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
యుకే ట్రిప్ లో ఉన్న మహేష్ ఫ్యామిలీ సభ్యులంతా ఉన్న ఫోటోలో ప్రిన్స్ మాత్రం మిస్సయ్యారు. బహుశా ఈ ఫోటోను ప్రిన్స్ తీసారేమో గానీ, నమ్రత, గౌతమ్, సితారలు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. కొత్త సినిమా కోసం కాస్త గడ్డం పెంచబోతున్నాడన్న వార్తలతో మహేష్ ఎలా ఉన్నారు అని ఎదురు చూస్తున్న అభిమాన వర్గానికి ఈ ఫోటో మరింత ఆసక్తిని పెంచింది.
బహుశా తన కొత్త లుక్ ఎవరికీ కనిపించకూడదనే భావనతో ఈ ఫోటోలో ప్రిన్స్ కావాలనే మిస్సయ్యారా? అన్న ప్రశ్నలు అభిమానుల్లో ఉత్సుకతను రేపుతున్నాయి. అయితే ఇటీవల యుకేలో లీక్ అయిన కొన్ని ఫోటోలలో లైట్ గడ్డం పెంచుతూ ప్రిన్స్ దర్శనమిచ్చిన విషయం తెలిసిందే.





