
‘శ్రీరామనవమి’ సందర్భంగా ఒంటిమెట్ట ఆలయాన్ని సందర్శించిన రోజా మాట్లాడుతూ… సుపరిపాలన సాగించిన శ్రీరాముడి తరువాత, అటువంటి పాలన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ప్రజలు చూశారని, ఆ తరువాత జగన్ రాకతోనే రామరాజ్యం వస్తుందని… తమ పార్టీ అధినేత జగన్ పై ఉన్న అభిమానాన్ని వైకాపా ఎమ్మెల్యే రోజా ఈ విధంగా ప్రదర్శించారు. త్వరలోనే ఏపీలో రాముడి పాలన తిరిగి మొదలవుతుందని అన్న రోజా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అంటే రోజా ఉద్దేశం… జగన్ మాదిరే శ్రీరాముడు కూడా కేసుల్లో ఇరుక్కున్నారా? అలాగే వైఎస్ పాలనలో జరిగిన అవినీతి నాడు శ్రీరాముడు పాలనలో కూడా జరిగిందని రోజా చెప్తున్నారా? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే అభిమానం ప్రదర్శించే ముందు, అత్యుత్సాహాన్ని పక్కనపెట్టి, వాస్తవాలతో మాట్లాడితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి రోజా ఏం చెప్పదలుచుకున్నారో గానీ, శ్రీరాముడితో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, జగన్ ను పోల్చడం భక్తులు కూడా జీర్ణించుకోలేని అంశంగా మారింది.
Kayadu Lohar has explained why she wrote “I look like a potato” after sharing her…
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…